రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటించబోతున్న సినిమాల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కనుంది. మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కకనున్న ఈ సినిమాలో ప్రభాస్ – దీపికా పదుకొనే జంటగా అమితాబచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకపోయినా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో నడుస్తోంది. అంటే ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎలా ఉందో ? తెలుసుకోవచ్చు. ఇటీవల ఈ సినిమా నైజాం ప్రి రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యింది. ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమా రైట్స్ రు. 72 కోట్ల ఖరీదుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇంత బడ్జెట్ పెట్టి ఇప్పటివరకు త్రిబుల్ ఆర్ తప్ప ఏ సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేయలేదు. మహానటి లాంటి సూపర్ హిట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేలోప్రభాస్ హీరో కావడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహూ , రాధేశ్యామ్ ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ గా అయినా నైజాంలో సాహో రు. 32 కోట్లు, రాధేశ్యామ్ రు. 25 కోట్ల కలెక్షన్స్ వసూలు చేశాయి.
ప్లాప్ సినిమాలు ఈ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేశాయంటే వచ్చే ప్రాజెక్ట్ కే సినిమా హిట్ అయితే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఊహించుకోవచ్చు. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కూడా కళ్ళు మూసుకుని రు. 72 కోట్లకు నైజాం రైట్స్ కొన్నారు.