జపాన్లో క్రేజ్ తెచ్చుకున్న అతికొద్దీ మంది ఇండియన్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అక్కడ ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లోని పాటలకు అక్కడ వారు డాన్స్ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఎన్టీఆర్ సినిమాలకు అక్కడ మంచి ఆదరనే ఉంది.
ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పటికీ అక్కడ సంచలన కలెక్షన్లు అందుకుంటూ ఎన్నో రికార్డులు తిరగరాస్తుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 20 ఏళ్ల కిందట నటించిన సింహాద్రి రిలీజ్ అవుతుండగా దానికి జపాన్లో ఎవరు ఊహించని రెస్పాన్స్ రావటం ఎప్పుడు ఎంతో సంచలనగా మారింది.
ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సింహాద్రి’ 2003 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న భారీస్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా సంచలనాలు రిక్డాలను సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డు స్టాయిలో బుకింగ్స్ను అందుకుంది.
ఇక జపాన్ లో అయితే ఎవరు ఊహించని సంచలనా రికార్డులను నమోదు చేసింది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ప్రీ సేల్స్ తో ఇప్పటికే 1 మిలియన్ మార్క్ ని అందుకొని సత్తా చాటింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రు. 6 లక్షలకు పైగా ఉంటుంది. కొత్త సినిమాలకే ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తే గొప్పగా చెబుతుంటారు.. అలాంటిది 20 ఏళ్ళ నాటి సినిమా రీరిలీజ్ అవుతుంటే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఎన్టీఆర్ క్రేజ్ను మరోలెవల్కు తిసుకువెళ్ళింది.