మొదట హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో నవదీప్ ఆ తరువాత మెల్లగా సపోర్టింగ్ రోల్స్ చేస్తు యాక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సమస్యలు ఎన్ని ఉన్నా జీవితంలో హ్యాపీగా బ్రతకాలని అనుకునే వ్యక్తిత్వం ఉన్న నవదీప్ కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకున్నాడు. నవదీప్ తన కేరీల్లో ఎన్నో సినిమాలలో నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు.
అయితే నవదీప్ కెరీర్ స్టార్టింగ్ లో ఓ స్టార్ హీరోయిన్ను లైంగికంగా వేధించాడని వార్తలు కూడా వచ్చాయి. ఆ హీరోయిన్ ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ అంకిత. అంకిత ఎన్టీఆర్తో కలిసి సింహాద్రి సినిమాలో నటించింది. ఈ సినిమా ఆమెను స్టార్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన.. ఆమెకు అంతగా సక్సెస్ రాలేదు. అదే సమయంలో అంకిత- నవదీప్ తో కలిసి పలు సినిమాల్లో నటించింది.
వీరిద్దరు కలిసి మనసు మాట వినదు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నవదీప్- అంకితను లైంగికంగా వేధించాడని, ఆయన టార్చర్ భరించలేక అంకిత సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు అప్పట్లో అంకిత- నవదీప్ పై ఫిల్మ్ ఛాంబర్ లో కూడా కంప్లైంట్ చేసిందన్న టాక్ కూడా వచ్చింది.
అయితే ఆ తరువాత అంకిత చేసినటువంటి ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని కొందరు కొట్టిపారేశారు. దీంతో మనస్తాపం చెందిన అంకిత సినీ పరిశ్రమకు దూమైంది. ప్రస్తుతం అంకిత పూర్తిగా సినిమాలు మానేసి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకునే పనిలో పడినట్లు సమాచారం. ఇక రస్నా గర్ల్గా అంకిత నేషనల్ వైడ్గా ఎంత పాపులరో తెలిసిందే.