తెలుగుదేశం పార్టీని..ఎన్ఆర్ఐలని సెపరేట్ గా చూడలేమని చెప్పవచ్చు. విదేశాల్లో సెటిల్ అయిన వారిలో చాలామంది టిడిపిని అభిమానించే వారు ఉన్నారు. ఎందుకంటే 1999 టైమ్ లో చంద్రబాబు సిఎం గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో సత్తా చాటిన చాలామంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు. అప్పటినుంచి చాలామంది ఎన్ఆర్ఐలు బాబు పై అభిమానంతో ఉంటారు. అయితే అలా సెటిల్ అయిన వారు ఇప్పుడు సొంత రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఏదో రకంగా సేవ చేయడానికి చూస్తున్నారు.
అలాగే రాజకీయంగా కూడా ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయాలని పలువురు ఎన్ఆర్ఐలు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన కొందరు ఎన్ఆర్ఐలు ఓ వైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే..మరోవైపు టిడిపిలో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే స్థానిక నేతలని కాదని బాబు ఎంతమంది ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఉదాహరణకు చూస్తే గుడివాడలో టిడిపి ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..ఆయన టిడిపి బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నారు. అయితే ఇటీవల ఇక్కడికి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము వచ్చారు..ఆయన ఫౌండేషన్ పెట్టి గుడివాడలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈయన కూడా గుడివాడ సీటు ఆశిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో బాబు ఎవరికి సీటు ఇస్తారనేది చూడాలి.
అటు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టిడిపి నేత బొల్లినేని వెంకట రామరావు ఉన్నారు. అక్కడే ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ ఉన్నారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ..పార్టీ పరంగా కూడా పనిచేస్తున్నారు. ఈయన కూడా సీటు ఆశిస్తున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐలు సీటు ఆశిస్తున్నారు. మరి బాబు ఎంతమంది ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తారో చూడాలి.