BJP : నిఖిల్ బదులుగా నితిన్ కి సన్మానం.. బీజేపీ అత్యుత్సాహం ఇలా రివర్స్ కొట్టిందా..?

జాతీయ పార్టీ బీజేపీ (BJP) ఈమధ్య తెలుగు రాష్ట్రాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగ తెలంగాణాలో బీజేపీ పార్టీ బలంగా మారాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే సినీ స్టార్స్ ని సైతం పార్టీ నేతలు మచ్చిక చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో రీసెంట్ గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని కలిశారు. తారక్ ని బీజేపీ కలవడం తో రాజకీయ పరంగా వేడి మొదలైంది.

ఇక రీసెంట్ గా బీజేపీ (BJP ) జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా నితిన్ ని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. అయితే జేపీ నడ్డా కలుద్దాం అనుకున్నది నితిన్ ని కాదట నిఖిల్ ని అని తెలుస్తుంది. నిఖిల్ ఈమధ్యనే నేషనల్ లెవల్ లో కార్తికేయ 2 తో సత్తా చాటారు. ఆ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నిఖిల్ ని పిలిచి సత్కరిద్దాం అనుకున్నారట. కానీ నిఖిల్ ని పిలవాల్సిన బీజేపీ తెలంగాణా నేతలు నితిన్ కి ఆహ్వానం అందించారట.

తెలంగాణా బీజేపీ నేతల అత్యుత్సాహం వల్లే ఇది జరిగిందని అంటున్నారు. అయితే త్వరలోనే నిఖిల్ తో బీజేపీ నేతలు స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. బీజేపీ ఓ ప్లాన్ ప్రకారంగానే ఇలా అందరి సెలబ్రిటీస్ ని కలుస్తున్నట్టు తెలుస్తుంది.

 

Tags: amith shah, bjp, JP Nadda, Nikhil, Nitin, ntr, politics, telangana, telugu movies, Tollywood