సినిమా ఇండస్ట్రీలో మహానటిగా పేరుతో సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా నటించిన సినిమా దసరా. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డులు నెలకొల్పింది. శ్రీరామనవమి సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది .
కలెక్షన్స్ పరంగా కూడా మేకర్స్ కు హ్యూజ్ లాభాలు తెచ్చిపెట్టింది . అంతేకాదు ఈ సినిమాలో నటించిన నటి నటులకు ప్రత్యేక గుర్తింపు లభించింది . టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ,మెగాస్టార్ చిరంజీవి , ప్రభాస్ లాంటి హీరోలు కూడా ఈ సినిమాను ఓ రేంజ్ లో పొగిడేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ సెలబ్రేషన్ ఆఫ్ వెన్నెల వీడియోస్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే .
కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కీర్తి సురేష్ కు కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఎదురైంది . “ఈ సినిమా షూట్ చేస్తున్న టైంలో డైరెక్టర్ మిమ్మల్ని మీరు అనకుండా నువ్వు అని సంబోధించారట.. మీలాంటి స్టార్ నటిని అలా పిలవడం మీ కోపం రాలేదా ..? అలా పిలుస్తున్నప్పుడు మీకు ఒళ్ళు మండిపోలేదా ..? “అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ” అలాంటిదేమీ లేదు . మనకు ఇష్టమైన వారిని.. మనకి కావాల్సినవారిని.. మనం నువ్వు అని పిలుస్తాం ..ఆ చదువు నేను తీసుకుంటాను.. మా అమ్మ నీ అమ్మమ్మని ఇప్పటికి నేను నువ్వు అంటూ పిలుస్తూ ఉంటాను.. అంత మాత్రాన నాకు వాళ్ళంటే ఇష్టం లేదు ..గౌరవం లేదు అని కాదు కదా .. ఇది కూడా అంతే . శ్రీకాంత్ ఓల చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ “అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఎవరో కావాలని డైరెక్టర్ పై ఇలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!