PS 1 : తమిళ బాహుబలి అంత తక్కువ రోజుల్లో పూర్తి చేశారా..!

మణిరత్నం డైరక్షన్ లో ఆయన డ్రీం ప్రాజెక్ట్ గా రాబోతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. చోళుల సామ్రాజ్యా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1(PS 1 ) సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. సినిమాలో విక్రం, కార్తీ, జయం రవిలతో పాటుగా ఐశ్వర్యా రాయ్, త్రిషలు నటించారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాని కేవలం 140 రోజుల్లోనే పూర్తి చేశారట.

సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో PS 1 టీం మొత్తం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా కార్తీ సినిమా షూటింగ్ జరిగిన రోజుల గురించి చెప్పారు. 140 రోజుల్లో రెండు పార్టులు పూర్తి చేశారట. ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాని రాజమౌళి ఐదేళ్లు తీశాడు. కానీ మణిరత్నం మాత్రం పొన్నియిన్ సెల్వన్ సినిమాని తక్కువ రోజుల్లో పూర్తి చేసి షాక్ ఇచ్చారు.

తమిళ బాహుబలిగా తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా కోసం తెలుగు వర్షన్ కి తణికెళ్ల భరణి మాటలు అందించడం విశేషం.

Tags: KARTHI, Kollywood, Maniratnam, Ponniyin Selvan, PS1, Trisha, vikram