టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతోంది. లోకేష్ పాదయాత్రకు అనంతపురం జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర జరుగుతోంది. ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో పాదయాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే లోకేష్ ఉరవకొండ లేని కమ్మూరులో ఓ నిరుపేద ఇంటికి లోకేష్ శ్రీరాముడులా వెళ్లాడు. మండుటెండలో నడుస్తూ వెళుతున్న లోకేష్ పక్కనే కనిపించిన చల్లటి జ్యూస్ అంగడికి వెళ్ళాడు. అభిమానంతో వారు కలిపి ఇచ్చిన ఆ జ్యూస్ తాగాడు. షాపు ఓనర్ రామలింగంను కూల్ డ్రింక్ షాప్ ఎలా ?నడుస్తుందని అడిగాడు. పెద్ద బిడ్డ ఇంజనీరింగ్ చదువుతోందని.. మిగిలిన ఇద్దరిని చదివించే స్తోమత లేకపోవడంతో తనతో పాటు కూలి పనులకుకు తీసుకు వెళుతున్నానని.. ఇలా ఒక్కోసారి షాపులో పనికి వస్తున్నారని తండ్రి రామలింగం ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే లోకేష్ అన్నయ్య లేని ఆ చెల్లెళ్లకు తాను అన్నయ్యలా ఉంటానని.. వారిద్దరినీ చదివిస్తానని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. వెంటనే ఆ నిరుపేద తండ్రి రామలింగంతో పాటు ఆ ఇద్దరు పిల్లల ఆనందానికి అవధులు లేవు. శ్రీరామనవమి వేడుకల్లో తమ కుటుంబాన్ని ఆదుకునే తమ పాలిట రాముడిలా ఆ రామారావు మనవడు నారా లోకేష్ వచ్చాడని తమకు వరం ఇచ్చాడని మురిసిపోయారు.
ఇక లోకేష్ అన్న తమను చదివిస్తామని హామీ ఇవ్వడంతో లిఖిత , గౌరీ ఆనందానికి అవధులే లేవు. తాము కలిపి ఇచ్చిన జ్యూస్ తాగి డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళకుండా.. తమ బాధ్యతను తీసుకునే అన్నయ్య దొరికాడని వారు ఎంతో మురిసిపోతున్నారు. మాకు ఓటేయండి మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు మీ సమస్యలు తీరిపోతాయని మాటలు ఏమార్చే నాయకుడిగా కాకుండా తన దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా.. సహాయం అయినా చేస్తూ అక్కడికక్కడే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. లోకేష్ చేసిన ఈ సాయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.