తాజాగా కన్నడ సెన్సేషన్ మూవీ ‘కాంతర’ విడుదలై 30 రోజులు పూర్తి చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. ఈ బ్లాక్బస్టర్ మూవీలో సప్తమి గౌడ కథానాయికగా నటించింది.
రిషబ్ శెట్టి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రానికి రూ. ప్రపంచవ్యాప్తంగా 305 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. KGF 2 తర్వాత కన్నడ సినిమాకు ఇది అరుదైన ఫీట్. ఈ సినిమా తెలుగులో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
‘కాంతర ‘ రిషబ్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిషోర్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అంజనీష్ లోక్నాథ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.