సీనియర్ నటి కాజల్ అగర్వాల్ రెండేళ్ళ క్రితమే కరోనా టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇటీవల ఓ బిడ్డకు తల్లి కూడా అయిన కాజల్ ఇప్పుడు స్వల్ప విరామం నేపథ్యంలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే తమిళంలో కమల్హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న ఆమె.. తెలుగులో బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్నా సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తోంది. బాలయ్య సినిమాతో రీఎంట్రీ ఇస్తే టాలీవుడ్లో కొన్నాళ్లపాటు తన కెరీర్ కు తిరిగి ఉండదని కాజల్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే కాజల్ తాజాగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కాజల్ పై బాలీవుడ్ సినిమా పరిశ్రమ అంతా భగ్గు మంటుంది. బాలీవుడ్లో నైతిక విలువలు లోపించాయని చెప్పిన కాజల్.. దక్షిణ భారతదేశ సినిమా పరిశ్రమలో ఉన్న విలువలు అక్కడ లేవని చెప్పారు. తన మాతృభాష హిందీ అని.. తను పుట్టింది పెరిగింది ముంబైలో అయినా ..అక్కడ పరిశ్రమపై ఉన్న అభిప్రాయాన్ని ఆమె ఓపెన్ గా కుండా బద్దలు కొట్టేశారు.
జాతీయ మీడియా ఇంటర్వ్యూలో కాజల్ పై విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాలు వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై ఆమె స్పందిస్తూ తాను ముంబైలో పుట్టి.. బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని.. అయితే తన కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్ అని కాజల్ వివరించారు. తాను ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలలోనే నటించానని హైదరాబాద్, చెన్నై నగరాలు అంటే తనకు ఎంతో ఇష్టం అని.. ఈ రెండు నగరాలను తన నివాసంగా భావిస్తానని కాజల్ చెప్పింది.
దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఎక్కువగా ఉంటుందని.. అక్కడ టాలెంట్ కు సరైన ఆదరణతో పాటు గుర్తింపు కూడా ఉంటాయని కాజల్ తెలిపింది. టాలెంట్ ఉంటే ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారని.. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఉన్న నైతిక విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్లో లేవని తన భావిస్తున్నట్టు కాజల్ చెపింది. దీంతో ఇప్పుడు ఆమె వ్యాఖ్యలపై బీటౌన్ సినీ అభిమానులు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కాజల్ ను టార్గెట్ చేస్తున్నారు.