గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా వైరల్ అవుతుంది. ఏంటి సీనియర్ హీరోయిన్ విజయశాంతికి పాతికేళ్ల కొడుకు ఉన్నాడా ? ఉంటే ఇప్పటివరకు ఆ కొడుకు గురించి ప్రపంచానికి తెలియదు.. మరి ఇప్పుడు కొత్తగా పాతికేళ్ల కొడుకు ఎక్కడ ? నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు అన్నది ఎవరికీ అర్థం కాక తలలు కొట్టుకుంటున్నారు. టాలీవుడ్లో మూడు దశాబ్దాల క్రితం విజయశాంతి అంటే ఎంతో క్రేజ్. స్టార్ హీరోలు సింగిల్ హ్యాండ్ తో రాజ్యం ఏలుతున్న రోజులు అవి. అలాంటి రోజుల్లో కూడా విజయశాంతి లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి తిరుగులేని సూపర్ హిట్లు కొట్టారు.
ప్రతిఘటన, కర్తవ్యం లాంటి సినిమాలు విజయశాంతిని స్టార్ హీరోల సరసన కూర్చోబెట్టాయి. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలతో విజయశాంతి అప్పటి స్టార్ హీరోలను మించిన రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఆ రోజుల్లోనే విజయశాంతి ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో ? అర్థమవుతుంది. మహిళా అభిమానులు విజయశాంతి కోసమే థియేటర్లకు క్యూ కట్టేవారు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా సామాజిక సేవలోను.. రాజకీయాల్లోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
యాక్షన్స్ సన్నివేశాలు, డ్యాన్సులు, డైలాగులు ఇలా హీరోలు చేసే అన్ని సీన్లలోనూ ఆమె నటిస్తూ లేడీ అమితాబచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే విజయశాంతి 1988లో ఎం.శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస ప్రసాద్ కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశారు. శ్రీనివాస ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. బాలయ్యే స్వయంగా శ్రీనివాస ప్రసాద్, విజయశాంతికి పరిచయం చేయడంతో పాటు ఆమెకు మేనేజర్ గా పెట్టారని అంటారు. ఆ పరిచయమే నమ్మకంగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.
విజయశాంతి, శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదు అనే నిర్ణయం తీసుకుందని అంటారు. ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకోవడం.. రాజకీయాల్లోకి రావాలన్న ఆత్రుత నేపథ్యంలో పిల్లలు ఉంటే తన పోరాట స్ఫూర్తి బలహీన పడుతుందని.. ఆమె పిల్లల్ని కనేందుకు ఇష్టపడలేదని అంటారు. అయితే వీటి గురించి తెలియని వారు విజయశాంతికి ఒక కొడుకు ఉన్నాడని లేనిపోని పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత విజయశాంతి, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.