ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్లు కృతి శెట్టి, శ్రీ లీల వీరిద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇంచుమించుగా వీరిద్దరూ ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసినా శ్రీ లీల సినిమాల్లో ఇంకా వరుసగా చాన్సులు అందుకుంటునే ఉంది. కృతిశెట్టికి మాత్రం ఇటీవల సినిమా చాన్సులు తగ్గుతున్నాయి అనే చెపాలి. ఉప్పెన తర్వాత ఒకటి రెండు హిట్లు పడినా ఆమె ఆ తర్వాత వరుసగా ప్లాపులు ఎదుర్కొంటోంది.
దీనికి కారణం కృతి శెట్టి మొదటి సినిమా ఉప్పెన తో సూపర్ హిట్ కొట్టింది. తర్వాత వరుసగా చాన్సులు వస్తుండడంతో.. తనకు తగ్గ పాత్రను ఎంచుకోవడంలో కృతి శెట్టి విఫలమైంది. ఛాన్సులు వచ్చిన ప్రతి సినిమాలను తను నటించింది. నానితో చేసిన శ్యామ్ సింగరాయ్, చైతుతో చేసిన బంగార్రాజు, రామ్ తో చేసిన ది వారియర్, సుధీర్ తో చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో చేసిన మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాల్లో బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ తప్పా అన్నీ వరుసగా ఫ్లాప్ అయాయి.
దీంతో కృతిశెట్టి కి సినిమా ఛాన్స్ లు తగ్గిపోయాయి. శ్రీ లీల అలా కాకుండా తనకు వరుస ఛాన్సులు వచ్చినా సరే ఆలోచించి తనకు ఆ సినిమా పేరు తెచ్చిపెడుతుంది.. అని అనిపిస్తేనే అందులో నటిస్తోంది. ఇలా ఆలోచించి సినిమాలు తీయడం వల్ల ఇప్పుడు బాలయ్యతోను, మహేష్ 28వ సినిమాలోని నటిస్తుంది. అమ్మడు వీటితో పాటు మరో రెండు సినిమాల్లో కూడా హీరోయిన్గా సైన్ చేసిందట.
సో కృతి సెట్టికి, శ్రీ లీలకు మధ్య ఇంత తేడా ఉండడం వల్లే శ్రీ లీల సక్సెస్ అవుతుంది. కృతి శెట్టి మాత్రం స్టార్ డంను సంపాదించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. కృతిశెట్టికి ఒకటి రెండు హిట్లు పడకపోతే ఆమె టాలీవుడ్ను మర్చిపోవడం గ్యారెంటీ..!