మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. 2017లో ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించింది. ఆమె తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానాన్నే కాక సౌత్ లో నాలుగు ఫిలింఫేర్ అవార్డులూ అందుకుంది. అయితే సాయి పల్లవి చాలా మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతగా ఆమె సినిమాల్లో నటించడం లేదు.
ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే పాత్రలను ఎంచుకునే ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్ కాకపోయినా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం కార్తికేయతో కలిసి హీరోయిన్ గా ఆమె ఓ సినిమాలో నటించబోతోంది. ఏడాదిగా తెలుగులో ఆమె విరాటపర్వం సినిమా మాత్రమే చేసింది. ఆమె చేసిన తమిళ్ గార్గీ సినిమా తెలుగులో కూడా విడుదలైంది
సాయిపల్లవి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు తాను చేసిన కథలన్నీ నచ్చితేనే చేశానని.. అది నాకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టాయని చెప్పింది. మేకప్పే ప్రపంచంగా ఉండే చాలా మంది హీరోయిన్లకు ఈమె భిన్నంగా ఎంటుంది. మేకప్ ఆమెకు కంఫర్ట్ గా ఉండదని చెప్పింది. ఆమె చేసిన ప్రతి సినిమాల్లోనూ డాన్స్ హైలెట్గా కనిపిస్తుంది. ఆమె మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సాయిపల్లవి స్పెషల్గా డ్యాన్స్ నేర్చుకోలేదట. మాధురి దీక్షిత్, ఐశ్వర్య డాన్సులు చూస్తూ పెరిగానని చెప్పారు.
నాకు డాన్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని.. ఇప్పటికీ ఆ ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నట్టు చెప్పింది సాయి పల్లవి. నిద్రలో లేపి అడిగినా డోల రే డోల పాటకు డాన్స్ వేస్తానని చెప్పింది సాయి పల్లవి. డాన్స్ విషయంలో పల్లవి మామూలుది కాదని.. తన ప్రతిభను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుందని ఆమె కోట్లాది మంది అభిమానులు చెపుతుంటారు.