ఒక తప్పు చేస్తే.. సరిచేసుకోవచ్చు. రెండు తప్పులు చేస్తే.. ఎంతో కొంత మారతారనే ఆశ కూడా పెట్టుకోవ చ్చు. కానీ, పదే పదే తప్పులు చేస్తుంటే.. ఏం జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే కు ఇప్పుడు ఇలాంటి పరిస్థి తే ఏర్పడింది. యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి రాజు ఉరఫ్ కన్నబాబు రాజు పరిస్థితి రోజు రోజు కు దిగజారుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిర కన్నబాబు రాజుకు మంచి పేరుంది. అయితే.. ఇటీవల కాలం లో ఆయన చేస్తున్న దూకుడు కారణంగా.. ఉన్న పేరు పోయి.. చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు పరిశీల కులు. కొన్నాళ్ల కిందట సొంత పార్టీ వైసీపీ నాయకులపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అ దేసమయంలో మీడియాపైనా ఆయన చిందులు తొక్కారు. దీంతో కన్నబాబు రాజుపై విమర్శలు వచ్చా యి.
కొన్నాళ్ల కిందట నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ ప్రజలతో దూకుడుగా వ్య వహరించారు. దీంతో ఒకానొక దశలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా `మా నమ్మకం నువ్వే జగన్` కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇలానే కన్నబాబు రాజు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పథకాలను వివరించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఓ విద్యార్థి.. తనకు విద్యాదీవెన పథకం అందలేదని అనడంతో కన్నబాబు రాజు ఫైరయ్యారు. విద్యాదీవెన సొమ్మును ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేసినా.. అనంతరం.. అవి కాలేజీలకు చెల్లిం చాల్సి ఉంది. దీంతో ఇవి లబ్ధిదారుల చేతుల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని కన్నబాబు రాజు ఓపికగా వారికి వివరించి ఉంటే.. ప్రజలకు అర్ధమయ్యేది. కానీ, ఇక్కడే కన్నబాబురాజు గాడి తప్పారు.
విద్యార్థిపై నిప్పులు చెరిగారు. పళ్లు పీకేస్తానని హెచ్చరించారు. ఈ పరిణామం తీవ్రంగా మారడం.. అధిష్టానానికి సైతం.. పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు వెళ్లడంతో ఇప్పుడు తాడేపల్లి కేంద్రంగా కన్నబాబు రాజు విషయంపై సీరియస్గా చర్చ సాగుతున్నట్టు సమాచారం. మరి ఈయనకు పార్టీ అధిష్టానం చివరకు మొండి చేయి చూపిస్తుందేమో చూడాలి.