శ్రీరెడ్డి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీరెడ్డి అటు హీరోయిన్ గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. అంతే కాకుండా యాంకర్ గా కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ కాస్టింగ్ కౌచ్ అంటూ రచ్చ చేసి ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. అర్థ నగ్నంగా ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నా చేసి ఒక్కసారిగా నేషనల్ మీడియాను తన వైపు తిప్పుకుంది. ఆ తరవాత టాలీవుడ్ ఇండస్ట్రీ శ్రీరెడ్డిని బ్యాన్ చేసింది. అలా బ్యాన్ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
శ్రీరెడ్డి కేవలం ఒక్కరిద్దరిని కాకుండా హీరోల నుండి డైరెక్టర్ ల వరకూ చాలా మంది పై ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఆ ఆరోపణలకు కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో శ్రీరెడ్డినే చాలా మంది ఇండస్ట్రీ వాళ్లు తప్పు పట్టారు. ఇక టాలీవుడ్ బ్యాన్ చేయడంతో తన మకాంను శ్రీరెడ్డి కోలీవుడ్ కు మార్చేసింది.కోలీవుడ్ లోనూ సినిమా అవకాశాలు అయితే లేదు. దాంతో యూట్యూబ్ లో మరియు ఫేస్ బుక్ లో ఖాతాలు తెరచి వంట వీడియోలు చేస్తోంది.
ఇక ఆ వంట వీడియోలలోనూ గ్లామర్ షో చేయడంతో లక్షల్లో వ్యూవ్స్ వస్తున్నాయి. కేవలం వంట వీడియోలు మాత్రమే కాకుండా శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ సపోర్ట్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. జగనన్న అంటూ సీఎం జగన్ కు పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. ప్రతిపక్షాల నాయకులు వైసీపీని విమర్శించినా వారికి కౌంటర్ లు ఇస్తూ వీడియోలు చేస్తుంది. అయితే అలాంటి శ్రీరెడ్డి సడెన్ గా సీఎం జగన్ పై కూడా నెగిటివ్ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా పోస్ట్ లో…..ఆంధ్ర లోకూడా మంగ్లీ, కనకవ్వ లాంటి తెలంగాణ జానపద సింగర్స్ ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు జగన్ అన్న ..ఇది ఆంధ్ర జానపద కళాకారురుల్ని అవమానించడమే అన్న..ఆంధ్రాలో శ్రీకాకుళం,కృష్ణ,సీమ,అన్ని రాష్ట్రాల్లో అనేకమంది కళని నమ్ముకుని ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు..వీళ్ళు చచ్చిపోతే ఆంధ్ర కళలు అంతరించి పోయినట్టే ..కర్ణాటక (కాంతారా),తమిళనాడు (జల్లికట్టు),తెలంగాణ (బోనాలు ) ఇలా ప్రతి రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలు..
మన రాష్ట్రంలో కొండపల్లి బొమ్మలు ,కూచిపూడి నృత్యం ,బందర్ లడ్డులు ,శ్రీకాకుళం గిరిజన నృత్యాలు ,కోలాటాలు ,తిరుపతి,అమరావతి స్థూపాలు,గుహలు ,తడ ఫాల్స్ ,ఉప్పాడ,ధర్మవరం ,మంగళగిరి చీరలు ,చేనేత కార్మికులు,గోదావరి పాపి కొండలు ,వైజాగ్ ఓడ రేవు, రంప చోడవరం అడవులు,అరకు అందాలు,రాయల సీమ గొప్పతనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర ప్రత్యేకతలు అనేకం..ఆ తిరుపతి వేంకటేశ్వరుని తో పాటు ,కుబేర లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుని వుంది ఆంధ్ర లో ..జగనన్న మీ కృషి ,దృష్టి ఇంకొంచెం ఈ కళాకారుల మీద పెడితే,అలాగే టూరిజం ఎంకరేజ్ చేస్తే ఆంధ్ర అభివృద్ధి తొందరలో పరుగులు తీస్తుంది. అంటూ శ్రీరెడ్డి తన పోస్ట్ లో పేర్కొంది.