ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు వ్యూహం ఫలించేలా కనిపిస్తోంది. నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో ఈ దఫా గెలిచి తీరాలని చంద్రబాబు సంకల్పం పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే ఆయన ఇక్కడ పావులు కదుపుతున్నారు. ఇటీవల రెండు రోజులు ఈ రెండు నియో జకవర్గాల్లోనూ పర్యటించారు. కృష్ణా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ ప్రత్యేకంగా చంద్రబాబు దృష్టి పెట్టారు.
గుడివాడలో ఇప్పటికే వెనిగండ్ల రాముకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికారికంగా ప్రకటిం చాల్సి ఉంది. అయితే.. తాజాగా నిర్వహించిన సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించడంతోపాటు.. గుడివాడ సభను హిట్ చేయడంలో వెనిగండ్ల సక్సెస్ అయ్యారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలను కూడా ఆయన తగ్గించుకుంటూ వస్తున్నారు. ఆర్థికంగా కూడా నాయకులకు సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు గుడివాడ ఎమ్మెల్యే నానికి అనుకూలంగా ఉన్నారనే పేరున్న టీడీపీ వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలోనూ.. వెనిగండ్ల దూకుడుగా ముందుకు సాగుతున్నారని.. వారి అవసరాలు తెలుసుకుని వాటిని తీరుస్తున్నారని చంద్రబాబు కూడా తెలుసుకున్నారు. దీంతో కీప్ ఇట్ అప్ అంటూ.. చంద్రబాబు వెనిగండ్ల భుజం తట్టడం గమనార్హం. ఇదేసమయంలో నూజివీడులోనూ టీడీపీని పుంజుకునేలా చేయడం లో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు.
గత కొన్నాళ్లుగా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమాకు చంద్రబా బు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ముఖ్యంగా అభ్యర్థి ఎంపికలో ఈ సారి ఎవరినీ నొప్పించకుం డా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో నూజివీడు నియోజకవర్గంలో ఈ సారి ఏకపక్షంగా కాకుండా.. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతారని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. చంద్రబాబు ఈ రెండు నియోజకవర్గాలపై చేస్తున్న కసరత్తు బాగుందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.