ఏపీ అధికార పార్టీ వైసీపీ ఒకవైపు రకరకాల సర్వేలతో ముందుకు సాగుతోంది. కూర్చుంటే సర్వే.. నిలబడి తే అన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. గడపగడపకు కార్యక్రమం ద్వారా సర్వే చేశారు. ప్రజ ల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ బెడిసి కొట్టినట్టు గ్రహించారు. దీంతో వెంటనే గృహసారథులు అనే కార్యక్రమం తీసుకువచ్చారు. రాష్ట్రంలో సగం మందిని కూడా నియమించుకోలేక పోయారు.
అయినా.. కూడా ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇది కూడా సర్వే నే అని చెబుతున్నారు. అయితే.. ఇక్కడ కూడా గడపగడపలో సీన్ రిపీట్ అవుతోంది. చాలా నియోజకవ ర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వైసీపీ సర్వేల్లో విషయం తెలిసిపోతోంది. అయితే.. దీనికి భిన్నంగా టీడీపీ ఎలాంటి సర్వేలు చేయడం లేదు. నిజానికి ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో రోజూ సర్వేల పేరుతో చంద్రబాబు నివేదికలు చెప్పేవారు.
తమ ప్రభుత్వానికి ఇంత అనుకూలత ఉంది.. అంటూ ఆయన రోజూ మీడియాకు కొన్ని అంకెలు వెల్లడిం చేవారు. అయితే.. చివరకు ఎన్నికలు వచ్చే సరికి ఏ అంకెలూ పనిచేయలేదు. ఇక, ఇప్పుడు ఏమనుకు న్నారో ఏమో.. అసలు సర్వేనే చేయడం మానేశారు. అలాగని.. పూర్తిగా దీనిని పక్కన పెట్టేశారా? అంటే అది లేదు. ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే.. దీనికి చంద్రబాబు ఎంచుకుంటున్న పంథా వేరేగా ఉంది.
తాను నిర్వహిస్తున్న సభలకు వస్తున్న జనాలు… వారు స్పందిస్తున్న తీరు వంటివాటిని చంద్రబాబు పరి శీలిస్తున్నారు. ఇదే తనకు తన పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న సర్వే రిపోర్టుగా భావిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినాప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కూడా ఓ రేంజ్లో దూసుకుపోతోంది. దీంతో మొత్తంగా.. టీడీపీకి ఎలాంటి సర్వేలు అవసరం లేకుండానే ప్రజల నుంచి రిపోర్టులు అందుతున్నాయని అంటున్నారు నాయకులు.