టాలీవుడ్ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమల కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగి పోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
ఎక్కడ చూసిన కృతిశెట్టి ఫొటోస్ వీడియోస్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి . ఆ తరువాత చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకోవడంతో కృతి శెట్టి ప్రజెంట్ తన ఆశలు అన్ని నాగచైతన్యతో నటిస్తున్న “కస్టడి” సినిమా పైన పెట్టుకొని ఉంది . మే 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది .
ఇలాంటి క్రమంలోనే కృతి కి సంబంధించిన ఓల్డ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి ఆ టైంలో రొమాంటిక్ సీన్స్ కూడా చేసింది . ఈ క్రమంలోనే ప్రతి రొమాంటిక్ షాట్ పూర్తవ్వగానే కృతి పక్కకు వెళ్లి ఫేస్ వాష్ చేసుకునేదట, ఈ క్రమంలోనే గమనించిన వైష్ణవ్ ఎందుకలా అని అడిగితే.. ఆమె ఇన్ఫెక్షన్ ఉంది అంటూ చెప్పుకొచ్చిందట .
అయితే నిజానికి కృతికి ఆలా కిస్ చేయడం ఇష్టం లేదని ..కేవలం సినిమాల కోసమే అలా ఒప్పుకుందని ..ఈ క్రమంలోనే రొమాంటిక్ షాట్ అయినా ప్రతిసారి వెళ్లి ఫేస్ వాష్ చేసుకునేది అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అయింది . దీంతో అప్పట్లో కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది..!!