ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వారిద్దరి మధ్యన మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడం వంటివి చాలా కామన్ గా మారిపోయాయి. అయితే అలాంటి వార్త మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్వీట్ కపుల్ అయిన కరీనాకపూర్ – సైఫ్ అలీ ఖాన్ వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే వీరి పిల్లలకు జహంగీర్, తైమూర్ అనే పేర్లు పెట్టి గోడవల్లో కూడా ఈ జంట ఇరుకున్నారు.
ఈ విషయాన్ని పక్కన పెడితే కొన్ని మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు ప్రస్తుతం నెట్టింటి హాట్ టాపిక్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే ఇటీవల సినిమా సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనేక కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇన్వాల్వ్ అవుతున్న దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ అలాగే ప్రముఖ సినీ క్రిటిక్ అని చెప్పుకునే ఉమర్ సంధు.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా రాసుకోచ్చారు.
రీసెంట్గా కరీనాకపూర్ – అలీ ఖాన్ మధ్య పెద్ద గొడవ జరిగిందంటూ ఈ గొడవలో కరీనా – అలీ ఖాన్ నీ మొహం పై గాయపరిచిందంటూ.. కానీ ఇప్పుడు వారి మధ్య జరిగిన పెద్ద గొడవ గురించి నేను బయట పెట్టాలనుకోవడం లేదంటూ రాసుకొచ్చాడు. కొంతమంది ఇది నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది అలీ ఖాన్ – కరీనాకపూర్ ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు.. దీంతో వారు విడాకులు తీసుకోబోతున్నారా అంటు కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పటికి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.