అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా తన తల్లి లాగా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ హిట్ హీరోయిన్గా మారాలని ఆశపడింది. ఇదే సమయంలో ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన జాన్వీ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సరైన విజయం కూడా అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే జాన్వీ టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు జంటగా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి ఇప్పటికే ఎన్టీఆర్- జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా బయటికి వచ్చాయి. జాన్వీ తన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి సినిమాలో తన పాత్ర పై మరింత అంచనాలు పెంచేసింది. ఇదే క్రమంలో జాన్వీ ఈ సినిమా కంటే ముందే మరో తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ తన మేనేజర్ చేసిన పొరపాటు వల్ల ఆమె ఛాన్స్ ను వదులుకుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.
అలా జాన్వీకి అవకాశం వచ్చిన సినిమా మరి ఏదో కాదు. అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్ లోనే తొలి హిట్గా నిలిచిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా. ఇక ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రొమాంటిక్ హిట్గా నిలిచింది. ఇక అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకున్నారట. ఆమెకి కూడా ఈ సినిమా స్టోరీ చెప్పగా ఈమె కూడా స్టోరీ నచ్చడంతో నటించటానికి ఓకే అయ్యిందట.
ఇదే సమయంలో ఆమె మేనేజర్ అక్కినేని హీరోల సినిమాల ట్రాక్ రికార్డు గురించి చెప్పి ఆమెను ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేసాడు. ఇక ఆ తర్వాత ఈ సినిమాల పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. పూజ- అఖిల్ మధ్య వచ్చిన రొమాన్స్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నయనే చెప్పాలి. ఈ విధంగా జాన్వీ తన మేనేజర్ కారణంగా ఓ భారీ హిట్ సినిమానుని వదులుకుంది.