కృష్ణ – బాలకృష్ణతో నటించి దేశాన్నే ఊపేసిన ఈ తేనెక‌ళ్ల అందాల సుంద‌రి ఎవ‌రో తెలుసా..!

అందం అభినయం ఆకట్టుకునే నటన కనబరిచే హీరోయిన్లు చాలా అరుదు. మొదటి సినిమాతో సో.. సో అనిపించుకున్నా ఆ తర్వాత తమ నటనతో తమపై ఫోకస్ పెంచుకుంటారు. ఇక ముందుగా ఆఫర్ల కోసం గ్లామర్ పాత్రలు చేసినా ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకొని హీరోయిన్ అందుకు ప్రత్యేకం. ఈమె నటించిన మొదటి రెండు సినిమాలు తోనే ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలి సినిమాల్లోనే తన గ్లామర్ హాట్‌ షో తో పిచ్చెక్కించింది. తన మ‌త్తుకళ్ళతో హోయలు ఒలికించి ప్రతి ఒక్కరినీ మాయ చేసింది.

ఆమె అందం ముందు కుర్రకారు అంతా ఆమె పేరునే స్మ‌రించేవారు. ఆమె సినిమాల్లో కనిపించింది అంటే చాలు మైమరిచిపోయేవారు. కొన్ని విమర్శలు కారణంగా చిత్ర పరిశ్రమకు దూరమైంది ఇంతకీ ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ తేనెకళ్ల‌ సుందరి మందాకిని. మందాకిని టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. మీరట్‌లో పుట్టిన ఈ అందాన్ని చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చారు బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌ కపూర్.

రామ్ తేరీ గంగా మైలీ అనే సినిమాలో ఈమె నటను చూసి మంత్రముగ్దులు అయ్యారు. ఇక అదే సమయంలో ఈమె అసలు పేరు యాస్మిన్ జోసెఫ్ ఠాకూర్. ఈ సినిమాల తర్వాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం, బాలకృష్ణతో భార్గవ రాముడు సినిమాల్లో నటించారు. అలాగే వెంకటేష్- అక్కినేని నాగేశ్వరావు కలిసి నటించిన బ్రహ్మరుద్రులు సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాటలో ఆడి పాడింది.

అదే సమయంలో అనేక హిందీ సినిమాలో నటించిన మందాకిని 90వ దశంలో బాలీవుడ్‌ను శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ప్రేమాయణం నడిపిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి దుబాయిలో కనిపించేసరికి ఈ పుకార్లు గట్టిగా వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వీరికి ఒక కొడుకు కూడా విన్నాడని మీడియా అప్పుడు తెగ ప్రచారం చేసింది. మందాకిని ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇక 1985 నుంచి 96 వరకు సినిమాల్లో కనిపించి వెండి తెరకు దూరమయ్యారు.

మాజీ బౌద్ధ సన్యాసి డాక్టర్.కాగ్యూర్ టి. రింపోచే ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. బౌద్ధమతాన్ని స్వీకరించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, కుమార్తె. సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె మా ఓ మా అంటూ తన కొడుకు రబ్బిల్‌తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ లో కనిపించారు. ఇక రీసెంట్గా బాలీవుడ్ లో కపిల్ కామెడీ షో లోఈమె సంద‌డి చేశారు.ఇప్పటికీ కూడా అదే అందంతో మెరిసిపోతున్న మందాకిని చూసి అందరూ షాక్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.