టాలీవుడ్లో నందమూరి, దగ్గుబాటి ప్యామిలీల అనుబంధం ఇనాటిది కాదు. గత కొన్నితారల నుంచి ఈ రెండు కుంటుంబల మధ్య ఎంతో అనుబందం ఉంది. నటరత్న ఎన్టీఆర్తో లెజెండ్రీ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. రామానాయుడు కెరీర్ మొదటిలోనే ఎన్టీఆర్తో ఎన్నో మంచి హిట్లు కొట్టారు. ఎన్టీఆర్తో ఎన్నో సూపర్ హిట్లు నిర్మించిన రామానాయుడు. ఆ తర్వాత అయన తనయుడు బాలకృష్ణతోను హిట్ సినిమాలను నిర్మించారు.
ఇక నందమూరి కుటుంబంలో మూడో తరం హీరోగా ఉన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్తోను ఓ సినిమా నిర్మించాలని అయన కల. అయితే ఆయన కోరిక తిరకుండనే రామానాయుడు మరణించారు. రామానాయుడు జీవించి ఉన్న రోజులో నటరత్న ఎన్టీఆర్తో తాను నిర్మించిన రాముడు భీముడు సినిమాను జూనియర్ ఎన్టీఆర్తో రీమేమెక్ చేయాలని కలలు కన్నారు. అది నా చిరకల కోరిక అని కూడా చెప్పారు. రాముడు భీముడు సినిమా రామానాయుడు కెరీర్ మర్చిన సినిమాలో ఒకటి.
ఈ రీమేక్ సినిమాలో నటించేందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రామానాయుడుకు మాట కూడా ఇచ్చాడు. అయితే ఆ సినిమాకు డైరక్టర్ని ఎవరిని పెట్టాలి అన్న చర్చలు జరుగుతున్న క్రమంలోనే రామానాయుడు మరణించారు. అయితే ఇప్పుడు అదే సినిమాను రామానాయుడు మనవడు, దగ్గుబాటి వంశంలో మూడో తరం వారసుడు దగ్గుబాటి రానా నిర్మాతగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాను నిర్మించాలని ఈ రెండు కుటుంబల అభిమానులు కోరుతున్నారు.
ఇక రానా నిర్మాతగా అలానటి క్లాసిక్ మూవీ రాముడు భీముడు సినిమాని ఇప్పుడు రీమేక్ చేస్తే అది నిజంగానే ఓ సంచలనం అవుతుంది. అలాగే తన తాత రామానాయుడు కోరిక రానా నెరవేర్చినట్టు అవుతుంది. నిజంగానే ఇద్దరి కాంబోలో సినిమా వస్తే అది పెద్ద సంచలనం అవుతుంది అనడంలో సందేహంలేదు.