జంబలకిడి పంబ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమని.. అప్పట్లో చాలా హిట్ సినిమాలు చేశారు. కేవలం కమర్షియల్ హీరోయిన్గా మాత్రమే కాకుండా… హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ ఆమె నటించారు. మిస్టర్ పెళ్లాం – శుభలగ్నం – మావిచిగురు లాంటి సినిమాల్లో ఆమని నటన మరవలేనిది. శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం భర్తను అమ్మే భార్య పాత్రలో ఆమె నటన నభూతోః నభవిష్యత్.
తన సినిమాలతో ఆమని ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కాగా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఆమని రామ్ గోపాల్ వర్మ మధ్యాహ్నం హత్య సినిమాతో సెకండ్ ఇన్సింగ్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏంసీయే సినిమాతో ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆమని – దివంగత హీరోయిన్ సౌందర్య బెస్ట్ఫ్రెండ్స్.
ఇద్దరు కన్నడ అమ్మాయిలే. అసలు ఆమని సోదరుడు అమర్తోనే ఆమని పెళ్లి చేయాలని సౌందర్య కుటుంబ సభ్యులు అనుకున్నారట. సౌందర్య ఫ్యామిలీతో ఆమని చాలా క్లోజ్గా ఉండేది. ఇక తన కొడుకు అమర్ని పెళ్లి చేసుకోమని సౌందర్య వాళ్ల నాన్న ఆమెను అడగడంతో సౌందర్య, ఆమని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారట.
అయితే అప్పుడు ఆమని ఏదోలా మ్యానేజ్ చేసేసిందట. అప్పుడు పక్కనే తెలంగాణ శకుంతల కూడా ఉన్నారట. అమర్ను తాను పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం.. అప్పటికే అమర్కు మరో అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందట. ఆ విషయం తెలియకే ఆయన అమలను అలా అడిగారట. ఇక సౌందర్య వాళ్ల నాన్న చనిపోయిన తరువాత అమర్ పెళ్లి జరిగిందట. అయితే దురదృష్టవశాత్తు సౌందర్య చనిపోయిన ప్రమాదంలోనే అమర్ కూడా చనిపోయాడు.