మాటల మంత్రి కూడా త్రివిక్రం శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్లో దర్శకుడుగా స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు త్రివిక్రమ్ మాటల రచయిత. రెండున్నర దశాబ్దాల క్రితం మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ అంచెలంచలుగా ఎదిగి ఈరోజు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఈరోజు త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూలో ఉన్నారు. అది త్రివిక్రమ్ రేంజ్.
మన్మధుడు సినిమాతో మాటల రచయితగానే కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు త్రివిక్రమ్. అప్పుడే నాగర్జున త్రివిక్రమ్ లోని టాలెంట్ గుర్తించి అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక త్రివిక్రమ్ తన భార్య సౌజన్యను కూడా నిర్మాత చేసేశారు. సితార బ్యానర్ తో కలిసి త్రివిక్రమ్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలకు త్రివిక్రమ్ భార్య పేరు నిర్మాతగా కనిపిస్తుంటుంది. త్రివిక్రమ్ భార్య మంచి నృత్య కళాకారిణి అన్న విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ భార్య సౌజన్య ఎవరో కాదు దివంగత మేటి గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కుమార్తె కావటం విశేషం. త్రివిక్రమ్ సిరివెన్నెల గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పటి నుంచి సౌజన్యకు తెలుసు. అప్పుడే త్రివిక్రమ్ ఆమెను ఇష్టపడ్డారు. అయితే తన ప్రేమను సౌజన్య దగ్గర ఆయన ఎప్పుడు ?వ్యక్తపరచలేదు. అయితే త్రివిక్రంలోని టాలెంట్ గుర్తించిన సిరివెన్నెల సౌజన్య అక్కతో త్రివిక్రమ్ పెళ్లి చేయాలని అనుకున్నారు.
అయితే పెళ్లి చూపులకు వెళ్లిన త్రివిక్రమ్ తనకు సౌజన్య నచ్చిందని.. ఆమెనే చేసుకుంటానని అప్పుడు తన లవ్ స్టోరీ రివీల్ చేశారట. అప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ముందుగా సౌజన్య అక్క పెళ్లి జరిపించి.. ఆ తర్వాత సౌజన్య – త్రివిక్రమ్ పెళ్లి జరిగేలా ప్లాన్ చేశారట. ఇక సౌజన్య తాజా ఇంటర్వ్యూలో చిన్నతనంలోనే తమ పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చింది.
త్రివిక్రమ్ తనను ఎంతో ప్రోత్సహించే వారని.. ఆయన వల్లే పుస్తక పఠణం అలవాటైందని చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ తనకు చదువులలో హెల్ప్ చేసేవాడని.. ఆయన మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడని.. లెసన్స్ చెప్పే టైంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవారని సౌజన్య తెలిపారు. ఒకవేళ త్రివిక్రమ్ టీచర్ అయితే స్టూడెంట్స్ అంతా కూడా పాస్ అయ్యే వారిని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా త్రివిక్రమ్ లవ్ స్టోరీ లోను చాలా ట్విస్టులే ఉన్నాయి.