ఇండియాలోనే టాప్ రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే… బాబు, జ‌గ‌న్ ర్యాంక్‌లు ఇవే..!

మన భారతదేశంలో అత్యంత ధనవంతులు అయిన వారు ఎవరు అని అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరులు ముఖేష్ అంబానీ, ఆదాని రాజకీయాల్లో కూడా అత్యంత ధనవంతులు ఎవరు అనగానే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఇక్కడ మన భారతదేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు ఎవరు.. అదేవిధంగా పేదరికంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఈ లిస్టులో చూద్దాం. అదే విధంగా వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు వారి వివరాలు కూడా చూద్దాం.

తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ వారు విడుదల చేసిన నివేదికల ప్రకారం మన భారతదేశంలో అత్యంత ధనవంతులు మరియు, పేద ఎమ్మెల్యేలు ఎవర‌నే విషయాలు బయటపడ్డాయి. ఇక అదే విధంగా ఏ పార్టీ నుంచి ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు.. వారి ఆస్తులు ఎంత అనే విషయాలు కూడా బయటికి వచ్చాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది బిలినియర్లు ఉండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నుంచి తొమ్మిది మంది, జెడిఎస్ పార్టీ నుంచి ఇద్దరు, కె ఆర్ పి పి నుంచి ఒక్కరు, అదేవిధంగా స్వ‌తంత్య్ర‌ అభివృద్ధి ఒకరు ఉన్నారని తెలుస్తుంది.

ఇక్కడ అందరూ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.265 కోట్ల అప్పులతో రూ.1413 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారని ఈ నివేదిక చెబుతుంది. అదేవిధంగా భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారు కాకపోవటం ఇక్కడ మరో విశేషం. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన గౌరీబీదనూరు నియోజవర్గం నుంచి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త కే హెచ్ పుట్టస్వామి గౌడ్ రెండవ అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు.

ఆయన ఆస్తులు విలువ సుమారు రూ.1,267 కోట్లగా అప్పులు ఐదు కోట్లుగా తేలింది. వీరి తర్వాత మూడో నిలిచిన అత్యంత ధనిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ యువ శాసనసభ్యుడు ప్రియ కృష్ణ ఈయన ఆస్తి సుమారు 1,156 కోట్లుగా తేలింది. ఇతర ముఖ్యమైన పేరులో మైనింగ్ డాన్ ప్రస్తుత కర్ణాటక ఎమ్మెల్యే ి జనార్దన్ రెడ్డి కూడా దేశంలోని అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సున్నా అప్పులతో రూ.246 కోట్ల ఆస్తులను ప్రకటించి ఆయన 23వ స్థానంలో నిలిచారు.

దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యే గా పశ్చిమ బెంగాల్‌ లోని ఇండస్ నియోజకవర్గం నుంచి నిర్మల్ కుమార్ ధార నిలిచారు. ఈయన ఆస్తులు రూ. 1,700 కాగా.. అప్పులు లేవు. ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన అత్యంత పేద ఎమ్మెల్యే బీజేపీకి చెందిన భగీరథి మురుళ్య. ఆయన ఆస్తుల విలువ రూ.28 లక్షలు, అప్పులు రూ.2 లక్షలు. ఈ టాప్ 10 లిస్ట్ లో ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు టాప్ 5 లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్ లో రూ.668 కోట్ల ఆస్తులతో టాప్ 4వ ధనవంతుడైన ఎమ్మెల్యే చంద్రబాబు కాగా.. రూ. 510 కోట్ల ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 7వ స్థానంలో ఉన్నారని తెలుస్తుంది.

ఇక ఈ నివేదికలో అత్యధిక ధనవంతులైన టాప్ 10 ఎమ్మెల్యేల లిస్ట్ ఈ కింది విధంగా ఉంది..

1. డీకే శివకుమార్ – కర్ణాటక – రూ. 1, 413 కోట్లు – కాంగ్రెస్

2. కేహెచ్. పుట్టస్వామి – కర్ణాటక – రూ. 1, 267 కోట్లు – ఇండిపెండెంట్

3. ప్రియాక్రిష్ణ – కర్ణాటక – రూ. 1, 156 కోట్లు – కాంగ్రెస్

4. నారా చంద్రబాబు నాయుడు – ఆంధ్రప్రదేశ్ – రూ. 668 కోట్లు – టీడీపీ

5. జయంతి బాయ్ – గుజరాత్ – రూ. 661 కోట్లు – బీజేపీ

6. బైరతి సురేష్ – కర్ణాటక – రూ. 648 కోట్లు – కాంగ్రెస్

7. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ – రూ. 510 కోట్లు -వైఎస్ఆర్సీపీ

8. పరాగ్ షా – మహారాష్ట్ర – రూ. 500 కోట్లు – బీజేపీ

9. టీఎన్. బాబా – చత్తీస్ ఘడ్ – రూ. 500 కోట్లు – ఐ.ఎన్.సీ

10. మంగళ ప్రభాత్ లోథా – మహారాష్ట్ర – రూ. 441 కోట్లు – బీజేపీ