మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక్కసారి హీరోయిన్గా నటించిన వారెవరైనా మళ్ళీ మళ్ళీ నటించే అవకాశాలు అందుకుంటున్నారు. ఎందుకంటే గురూజీ అంతగా తనకి ట్యూన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫస్ట్ లీడ్ హీరోయిన్ అంటే ఖచ్చితంగా ఆయన దర్శకత్వం వహించే నెక్ట్స్ సినిమాలో కూడా ఫిక్స్ అని అందరూ బ్లైండ్గా ఫిక్సవుతారు. దర్శకుడిగా చేసిన మొదటి రెండు సినిమాలలో నటించిన హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవలేదు.
వారే శ్రియ, త్రిష. తరుణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకుడిగా మారుతూ చేసిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రియకి మళ్ళీ రెండవసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం రాలేదు. త్రివిక్రమ్ సినిమా చేశాక శ్రియ ఎంతో గొప్ప స్టార్ హీరోయిన్ అయ్యింది. అయినా త్రివిక్రమ్ ఆమెకు మరోసారి తన సినిమాల్లో ఆవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమాలో హీరోయిన్గా నటించిన త్రిష కూడా గురూజీ దర్శకత్వంలో మళ్ళీ నటించలేదు.
అయితే, జులాయి సినిమాలో హీరోయిన్గా నటించిన ఇలియానా ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ తెరకెక్కించిన జల్సా సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. రెండూ సూపర్ హిట్లే. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్ సమంత. ఆమె తర్వాత పూజా హెగ్డే. ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న పూజాకి గురూజీ అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో భారీ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ సినిమాలోనూ ఆమే హీరోయిన్.
ఇలాంటి గోల్డెన్ ఛాన్సే తనకు వస్తుందని అనూ ఇమ్మానియేల్ కూడా భావించింది. సమంత, ఇలియానా, పూజా హెగ్డే లాంటి స్టార్స్ మాదిరిగా అనూ కూడా ఆశ పడింది. కానీ, గురూజీ ఆమెను నట్టేట ముంచినంత పని చేశాడు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన డిజాస్టర్ అయింది.. అదే అజ్ఞాతవాసి. ఈ సినిమాతో భారీ హిట్ వస్తుందని ఆశపడిన కీర్తి సురేష్, అనూ ఇమ్మానియేల్లకి దిమ్మ తిరిగింది. ముఖ్యంగా అనూ ఊహించింది త్రివిక్రమ్ తారుమారు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.