భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటే ఎన్నో తంతులు ఉంటాయి. పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పూర్వకాలం నుంచి పెళ్లి ఎంతో పవిత్రంగా చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వివాహం చేసే తంతు పూర్తిగా మారిపోయింది. పెళ్లిళ్లు చేసే సమయంలో చాలా తప్పులు చేస్తున్నారు. చాలామంది ఫ్యాషన్ పేరిట పెళ్లిళ్లలో ఎన్నో తప్పులు చేస్తున్నారు.
పెళ్లి పందిట్లో సకల దేవతలు కొలువై ఉంటారు. కొందరు పెళ్లి పందిట్లోకి చెప్పులు వేసుకుని వస్తున్నారు. అలాంటి పవిత్రమైన పందిట్లోకి చెప్పులు వేసుకుని రాకూడదు.. ఇక పెళ్ళిలో తలంబ్రాలు కాకుండా ఇటీవల కాలంలో ధర్మోకోల్ బబుల్స్ తలపై పోసుకుంటున్నారు. ఇవి తలపై పోసుకోవటం సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం అని మనుధర్మ వేత్తలు చెబుతున్నారు.
ఇక పెళ్లి జరిగే ముహూర్తంలో నక్షత్రాలు, గ్రహాలు అన్ని కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలట. అలా చూసుకున్నాక ఇద్దరి జాతకం బాగున్నాక మాత్రమే పెళ్లి చేయాలట. లేకపోతే వారు విడిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుందని.. వారి సంసారం సజావుగా సాగదని చెబుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ క్యూట్ కపుల్స్ నాగచైతన్య – సమంత కూడా పెళ్లి జరిగాక నాలుగేళ్లపాటు కాపురం చేసి విడిపోయారు. అయితే వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు వీరిద్దరి జాతకాలు సరిగా కలవలేదని.. అయినా వీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి నాగచైతన్యను కాదనలేక నాగార్జున ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటారు. వీరిద్దరి జాతకాల్లో చాలా వైరుధ్యాలు ఉన్నాయని అందుకే వారు విడిపోయారని చెబుతున్నారు. ఇక వేణు స్వామి లాంటి పేరున్న జ్యోతిష్యులు కూడా ఇవన్నీ గమనించే వారిద్దరూ విడిపోతారని ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే.