నా కూతురికి పెళ్లి చేయ‌ను… విడాకులు ఇచ్చేయ‌మంటా… డైరెక్ట‌ర్ తేజ ఇంత బోల్డ్ కామెంట్సా…!

డైరెక్టర్ తేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం తేజది. ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో తేజకు ఆయనే సాటి. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న అహింస సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు రెండో తనయుడు అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. రజిత బేడీ – గీతిక – సదా – రవికాలే – కమల్ కామరాజు – మనోజ్ టైగర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు.

జూన్ 2 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తేజ బ్యాక్ టు బ్యాక్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ప్రెస్ మీట్స్ లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా తన ఇంటర్వ్యూలో తన కూతురు, కొడుకు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకును త్వరలోనే హీరోగా పరిచయం చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తేజ అలాగే కూతురి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగివచ్చింది.. నేను ఆమెకు పెళ్లి చేయను నచ్చినవాడని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను.. ఒకవేళ పెళ్లయ్యాక భర్తతో పడకపోతే విడాకులు తీసుకోమని కూడా చెప్పాను.. మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది అనవసరం అని తన పిల్లలకు ఎప్పుడు చెబుతూ ఉంటానని తేజ బోల్డ్ కామెంట్స్ చేశారు.

దీంతో తేజ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అహింస సినిమాను డైరెక్ట్ చేస్తున్న తేజ ఈ సినిమా తర్వాత అభిరాం సోదరుడు రానాతో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరకెక్కించే సినిమా ఆ సినిమాను మించి ఉంటుందని తెలుస్తోంది.