టాలీవుడ్ లోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. అయితే మహేష్ సినిమాలా లేక ఫ్యామిలీయా ? అంటే మహేష్ కచ్చితంగా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్య ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు.
కోట్లు తెచ్చిపెట్టే సినిమాల కంటే ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడమే తనకు ఎక్కువ ఇష్టమని మహేష్ బాబు ఎప్పుడూ నమ్ముతాడు. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే గ్యాప్ తీసుకుని మరీ తన ఫ్యామిలీతో ఎప్పుడు వెకేషన్ కి వెళుతూ ఉంటాడు. ఇక ఇలానే మహేష్ బాబుని ఫాలో అవుతూ ఉంటుంది సాయి పల్లవి కూడా..! ఈమె కూడా మహేష్ లానే తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడుతుంది.
షూటింగ్లో ఒకసారి ప్యాకప్ చెప్పిన వెంటనే తను హీరోయిన్ అనే విషయాన్నే ఆమె మర్చిపోతుందట. మన ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు ఆ పని మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. అలాగే ఆ పని మన వ్యక్తిగత జీవితంలోకి తీసుకు రాకూడదు అన్నదే సాయిపల్లవి సిద్ధాంతం.
మన వ్యక్తి జీవితంలో దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానినకి ఇవ్వాలి వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు వేరువేరుగా చూసుకుంటేనే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ సాయి పల్లవి చెబుతుంది. కాగా సాయి పల్లవి తమిళంలో ఓ సినిమా చేస్తుంది. శివ కార్తికేయ హీరోగా వస్తున్న ఈ సినిమాని కమలహాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.