ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు పూజా హెగ్డే అంటే ప్రత్యేకంగా గౌరవం చూపించిన మహేష్ బాబు ఇప్పుడు ఆమెపై పీకల్లోతు కోపంగా ఉన్నారట. దానికి మెయిన్ రీజన్ అమ్మడు ఆయన సినిమా పట్ల నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తుంది అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా నటిస్తున్నాడు . ఎస్ ఎస్ ఎం బి 28 హాష్ ట్యాగ్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే మూడో షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది.
అయితే మహేష్ బాబు మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఎంచక్కా జాలిగా వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మహేష్ బాబు కోసం ఇన్నాళ్లు కాల్ షీట్స్ ఇచ్చి వెయిట్ చేసిన పూజ హెగ్డే ఇక కాల్ షీట్స్ ఇవ్వలేను అంటూ డైరెక్టర్ కు ముందుగా చెప్పేసిందట . అంతేకాదు ఇంకా ఈ సినిమాలో పూజ హెగ్డే పై చిత్రీకరించాల్సినవి రెండు పాటలు మూడు ఇంపార్టెన్స్ సీన్స్ ఉన్నాయట .
. పూజ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇవ్వడం పట్ల మహేష్ బాబు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు సైతం పూజ బెండ్ తీసే విధంగా స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేయమని త్రివిక్రమ్ కు సజెస్ట్ చేశారట . ఈ క్రమంలోనే బుట్ట బొమ్మ పూజ హెగ్డే కెరియర్ అయోమయ స్థితిలో పడిపోయింది అంటున్నారు జనాలు . అంతేకాదు గతంలోనూ రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ తో ఇలాంటి గొడవలు పెట్టుకుంది . మళ్లీ అదే టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో ఈ విధంగా ఇన్నర్ ఫైట్ లు క్రియేట్ చేసుకోవడం పూజ హెగ్డే కెరియర్ కు మైనస్ గా మారబోతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు . చూడాలి మరి దీనిపై పూజా హెగ్డే ఎలా స్పందిస్తుందో..?