బాలీవుడ్ లవ్ కపుల్స్ గురించి మాట్లాడుకుంటే అందరికి ముందు గుర్తొచ్చేది టైగర్ ష్రాఫ్ దిశా పటాని (Disha Patani)ల గురిచే. ఇద్దరు ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి కనిపిస్తారు. ఇద్దరు కలిసి హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తారు. ముంబై లో ఎక్కడపడితే అక్కడ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారు. టైగర్ ఉంటే దిశా.. దిశా ఉంటే టైగర్ అన్నట్టుగా కనిపించే వారు. ఇద్దరు ఈ రేంజ్ లో తిరిగి ఎప్పటికి పెళ్లి చేసుకుంటారో అని అనుకున్నారు.
కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇన్నాళ్లు బాగా తిరిగి ఎంజాయ్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పటాని (Disha Patani)లు సెపరేట్ అయ్యారు. కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన వీరు ఎవరికి వారే అన్నట్టు సెపరేట్ అయ్యారు. ఈ విషయం మీడియా ముందే పసిగట్టినా లేటెస్ట్ గా కాఫీ విత్ కరణ్ షోలో క్లారిటీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్.
దిశా తనకు కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమే అని అన్నాడు. వీకెండ్స్ లో కలిసి రెస్టారెంట్ కి వెళ్లే వాళ్లం.. తనకు ఇష్టమైన ఫుడ్ నాకు ఇష్టమైన ఫుడ్ ఒకటే అందుకే కలిసి రెస్టారెంట్ కి వెళ్లే వాళ్లం. అంతేతప్ప మా మధ్య ఏమి లేదని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుతం తన స్టేటస్ సింగిల్ అని కూడా చెప్పాడు టైగర్ ష్రాఫ్. మరి వ్యవహారం ఎక్కడ దెబ్బ కొట్టిందో ఏమో కానీ దిశా కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి షాక్ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్.