20 ఏళ్ల క్రితం తెలుగులో చాలా మంది హీరోయిన్లు వచ్చి బాగా పాపులర్ అయ్యారు. ఈ లిస్టులోనే ఇడియట్ రక్షిత కూడా ఒకరు. రక్షిత కన్నడ కస్తూరి. పూరి జగన్నాథ్ రక్షితను ఇడియట్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో పొగరు బోతు అమ్మాయి పాత్రలో రక్షిత నటన కుర్రాళ్లకు మాంచి హీటెక్కించింది. అసలు ఆ సినిమాలో రక్షితను బ్యాక్ నుంచి ఆమె ఒంపుసొంపులు చూసిన నాటి యూత్కు పిచ్చెక్కిపోయినట్లయ్యింది.
ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత నాగార్జునకు జోడీగా శివమణి, చిరుకు జోడీగా అందరివాడు సినిమాలు కూడా చేసింది. మహేష్బాబు నిజం సినిమాలోనూ నటించింది. ఇడియట్ తర్వాత శివమణి సినిమాలో నాగార్జున ప్రేమలో పడే రోల్లో రక్షితకు మంచి మార్కులు వచ్చాయి. రక్షిత మంచి ఫామ్లో ఉండగానే కన్నడ డైరెక్టర్ ప్రేమ్ను ప్రేమ వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
రక్షిత తల్లిదండ్రులు బిసీ గౌరీశంకర్, మమతారావు కన్నడ నటులు కావడంతో రక్షితకు సినిమాల్లో సులువుగానే అవకాశాలు వచ్చాయి. హీరోయిన్గా సినిమాలకు దూరమైన రక్షిత ఆ తర్వాత నిర్మాతగా మారింది. జోగయ్య, డీకే సినిమాలు నిర్మించింది. ప్రస్తుతం రక్షిత కన్నడ బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఇక ప్రస్తుతం ఆమె భారీ ఆకారంతో అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వివాహం అనంతరం ఒక కొడుకు పుట్టాక అనారోగ్య సమస్యలతో అస్సలు ఆమె చాలా లావెక్కిపోయింది. అసలు ఇడియట్, శివమణి సినిమాల్లో రక్షితను ఇప్పుడు ఉన్న రక్షితను చూస్తే అసలు మనం గుర్తు పట్టలేం. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ తాను లావెక్కానని రక్షిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.