నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంత పీక్స్లో ఉన్నాడో చూస్తున్నాం. అఖండ తర్వాత బాలయ్యకు అఖండ యోగం పట్టింది. అఖండ బాలయ్యకు చాలా యేళ్ల తర్వాత తిరుగులేని బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి కూడా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం బాలయ్య వరుస హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108 వ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్పై హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మరో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య నటించే సినిమాపై ఇప్పటికే రకరకాల డిస్కర్షన్లు స్టార్ట్ అయిపోయాయి.
ఈ సినిమాకు పలువురు దర్శకుల పేర్లు వినిపించినా ఫైనల్గా బాలయ్యకు కలిసొచ్చిన బోయపాటి శ్రీనే ఖరారయ్యాడని టాక్ ? అయితే ఈ సినిమా అఖండ 2నా, లెజెండ్ 2నా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇక ఈ సినిమా డైరెక్టర్, కథ విషయంలో కాస్త క్లారిటీ ఉండగా.. ఇప్పుడు మరో సస్పెన్స్ కూడా రివీల్ అయ్యింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, యువ నిర్మాత నాగ వంశీ తన బ్యానర్లో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ సినిమాను కన్ఫార్మ్ చేసినట్టుగా ఉంది. నాగ వంశీ చేసిన ట్వీట్ సింహం ఎమోజీతో జూన్ 10 అన్న మెసేజ్తో ఉంది. అయితే దీనర్థం ఏంటంటే బాలయ్య కొత్త సినిమాపై నాగవంశీ ఆ రోజు అధికారిక ప్రకటన చేయనున్నారని.. అందుకే సింహం ఎమోజీ జతచేశారని.. బహుశా టైటిల్కు బాలయ్యకు కలిసొచ్చిన సింహంకు లింక్ ఏదైనా ఉందా ? అన్న చర్చ కూడా నడుస్తోంది.