‘డైలీ ఆంధ్రా’ ఎక్స్‌క్లూజివ్‌: మెగా ఫ్యామిలీలో మూడో త‌రం వార‌సుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌…!

మెగా ఫ్యామిలీలో ఎట్టకేలకు వారసుడు రాబోతున్నాడు. డైలీ ఆంధ్రకు ఇండస్ట్రీలోని అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి అందిన సమాచారం ప్రకారం చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల రెండో వారం చివ‌ర్లో తండ్రి కాబోతున్నాడు. చిరంజీవికి కచ్చితంగా వారసుడే జన్మిస్తాడ‌ని మెగా ఫ్యామిలీ అంతా న‌మ్మ‌కంతో ఉన్నార‌ని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. రామ్ చరణ్, అపోలో గ్రూప్ సంస్థల అధినేత్రి ఉపాసన కామినేని దంపతులకు వివాహం జరిగి ఇప్పటికే 10 ఏళ్లు దాటుతుంది.

ఇండస్ట్రీలో రామ్ చరణ్ వయసు ఉన్న స్టార్ హీరోలు అందరూ ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని పిల్లలకు కూడా జన్మనిచ్చారు. అయితే ఉపాసన – చరణ్‌ దంపతులు ఇప్పటికీ పిల్లలను కనకపోవటంతో దీనిపై రకరకాల చర్చలకు తావిచ్చినట్లు అయింది. చిరంజీవితో పాటు చిరంజీవి భార్య సురేఖను సైతం ఎన్నో సందర్భాల్లో దీనిపై ప్రశ్నిస్తే చిరు మాట్లాడుతూ నాకు తాత కావాలని ఉంది.. మనవడిని చేతిలో ఎత్తుకుని ఆడించాలన్న కోరిక ఉంద‌ని చెప్పారు.

అయితే ఫైనల్ గా పిల్లలను ఎప్పుడు ? కనాలి అనేది వారి ఇష్టం.. వారి అభిప్రాయానికి తాను వదిలి వేస్తున్నట్టు చిరంజీవి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే చిరంజీవి గతంలో మనవడు కావాలన్నా కోరికను వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంద‌న్న న‌మ్మ‌క‌మే మెగా ఫ్యామిలీ అంద‌రికి ఉంద‌ట‌. అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఇంట్లో మూడో తరంలోనూ వారసుడు జన్మించాల‌ని వారంద‌రూ పూజ‌లు చేస్తున్నార‌ట‌. అలాగే చిరు సురేఖ దంపతులు తమ వార‌సుడి ముద్దుల బేబీని చేతిలో ఎత్తుకొని ఆడించే సమయం ఆసన్నమైంది.

ఈనెల 16 – 17 తేదీలలో ఉపాసనకు శాస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేసేందుకు అపోలో హాస్ప‌ట‌ల్లో అత్యంత ప్లానింగ్‌తో ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా డైలీ ఆంధ్ర వెబ్‌సైట్ బ్రేక్ చేసిన ఈ ఎక్స్ క్లూజివ్ వార్తతో మెగా అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. మెగా ఫ్యామిలీలో మూడో తరం వారసుడు జన్మించాల‌ని వారంద‌రు కోరుకుంటున్నారు. అదే జ‌రిగితే వారి ఆనందానికి అవధులు అయితే లేవు. ఇప్పుడు ఈ వార్తను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.