ఆ విషయం చిరంజీవికే సెట్ కాలేదు.. మరి నాగార్జున పరిస్థితి ఎలా ఉంటదో..!?

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రీమిక్‌ సినిమాల హవా గట్టిగా నడుస్తుంది.. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ సినిమాలు తెలుగులో డబ్ అయినా కూడా మళ్లీలీ రీమేక్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్‌లో మెగా బ్రదర్స్ సినిమాలు రీమేక్స్ మీదనే నడుస్తున్నాయి. చిరంజీవి- పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు.

చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ కూడా రీమిక్స్ సినిమాలు.. ఇక పవన్.. భీమ్లా నాయక్, బ్రో.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేకే. ఇదే సమయంలో భోళా శంకర్ ఫలితం తర్వాత చిరంజీవి రీమిక్స్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాడనే టాక్ కూడా నడుస్తుంది. అయితే చిరంజీవి వదిలేస్తే ఎప్పుడు రీమిక్స్ సినిమాలను నాగార్జున నమ్ముకున్నాడు.. ఈ అక్కినేని సీనియర్ హీరో ఈ మధ్యకాలంలో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా అక్కినేని అభిమానులు నాగార్జున అసలు సినిమాలు చేస్తాడా..? బిగ్ బాస్ కే పరిమితం అవుతాడా..? అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే నాగ్ త‌న‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాను ప్రకటించి ఫ్యాన్స్ కు మంచి ఊపునిచ్చాడు. నా స్వామి రంగా సినిమాతో నాగ్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ అయిన పోరింజు మరియం జోస్ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది.

అందులో జోజు జార్జ్ హీరోగా నటించాడు.. ఊర‌ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది. ఎప్పటి నుంచో ఈ సినిమాని నాగార్జున రీమేక్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. నాగార్జున బర్త్ డే వీడియో రిలీజ్ చేశాక రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు అభిమానులు. ఇక మలయాళం లో ఈ సినిమా కథ బాగుంటుంది. తెలుగులో ఏమైనా మార్పులు చేర్పులు చేశారు తెలియదు.. కానీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే.. ఈ సినిమా తెలుగులో డబ్ అవలేదు. 2019లో విడుదలైన సినిమా కాబట్టి ప్రేక్షకులు కూడా అంత పెద్దగా తెలియదు. దీంతో నాగార్జున ఈ రీమేక్ చేయడం మంచిదే అని కొందరు అంటున్నారు. అయితే చిరంజీవి రీమిక్స్ తో ప్లాప్‌లు అందుకున్నాడు. మరి నాగ్‌ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.