టాలీవుడ్లో వరుసగా ఏదో ఒక ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శర్వానంద్గా బాగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న శర్వానంద్ తన ప్రియురాలు అయిన రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. త్వరలోనే ఈ పెళ్లి జరగనుంది.
ఈ టైంలో శర్వానంద్కు రోడ్డు ప్రమాదం జరిగి.. తీవ్ర గాయాల పాలవ్వడంతో టాలీవుడ్ అంతా తీవ్ర ఆందోళనతో ఉంది. శర్వానంద్కు ఏం జరిగింది ? అంటూ ఆరా తీస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. నిన్న రాత్రి శర్వానంద్ ప్రయాణిస్తోన్న కారు ఫిల్మ్నగర్లో జంక్షన్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడినట్టు తెలుస్తోంది.
కారు బోల్తా పడడంతో శర్వానంద్కు గాయాలు అయ్యాయి. వెంటనే ఈ ప్రమాదం చూసిన స్థానికులు శర్వానంద్ను ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి హుటాహుటీన చేరుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెపుతున్నారు.
కొద్ది రోజుల్లోనే పెళ్లి జరగాల్సిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడంతో శర్వానంద్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.