పవిత్ర లోకేష్ తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించింది. ఆమె పుట్టింది పెరిగింది అంత కర్ణాటకలోనే. కన్నడలో కెరియర్ ఆరంభంలో హీరోయిన్గా దాదాపు 20 చిత్రాలలో నటించింది. కన్నడలోని చాలా సీరియల్స్ లో కూడా ఈమె నటించింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా సీనియర్ నటుడు వీకె నరేష్ను సీక్రెట్ గా ఆమె వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వివాహమైన తర్వాత నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల రచ్చ మామూలుగా లేదు.
నరేష్ కు ఇది నాలుగో వివాహం. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ అందరితోనూ విడిపోయాడు. కాగా మూడో భార్య రమ్య రఘుపతి తో విడాకుల విషయం ఇంకా కోర్టులో ఉంది. రమ్య రఘుపతి రమేష్ కు విడాకులు ఇవ్వను అని పట్టు పట్టి కూర్చోవడంతో రహస్యంగా పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్నాడంటున్నారు. పవిత్ర లోకేష్ కు ఇది మూడో వివాహం.
పవిత్ర లోకేష్ – నరేష్ పెళ్లి చేసుకున్న సందర్భంగా పవిత్ర రెండో భర్తతో.. తన పిల్లలతో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. రెండో వివాహంలో ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంతకీ ఆమె రెండో భర్త ఎవరో ? తెలుసుకుందామా. పవిత్రకు ముందు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పెళ్లి చేయగా.. యేడాదికే వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత పవిత్ర కన్నడ సీరియల్స్ లో యాక్టింగ్ చేసే టైంలో ఆమెకు కన్నడ సీరియల్ యాక్టర్ సుచంద్రప్రసాద్ తో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారు. యాక్టర్ సుచేంద్ర ప్రసాద్ – పవిత్ర లోకేష్ తో మొదటి వివాహం కాదు. అతనికి అంతకుముందే కన్నడ నటి మల్లికతో వివాహం జరిగింది. ఆ తర్వాత పవిత్ర లోకేష్ ను ప్రేమించి మల్లికతో విడాకులు తీసుకుని పవిత్రని పెళ్లి చేసుకున్నారు సుచేంద్ర. పవిత్రకు సుచేంద్ర ప్రసాద్ కు పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకు ఇద్దరు కుమారులు పుట్టారు. తర్వాత వీరు కొని కారణాలతో వీరు విడిపోయారు.