టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో దసరా నటుడు ఉన్నాడు అన్న ప్రకటన ఇప్పటికే వచ్చింది. అలాగే మరో అదిరిపోయే న్యూస్ కూడా బయటకు వచ్చింది.
బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. సహజంగానే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరోతో పాటు మరో బలమైన పాత్రను రాస్తూ ఉంటాడు. అలవైకుంఠపురంలో సినిమా కోసం అక్కినేని మనవడు సుశాంత్ ను తీసుకున్నాడు. మరి ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో అక్షయ కోసం ఎలాంటి పాత్రను ? రాశాడు అన్నది సస్పెన్స్ గా ఉంది.
పూజ హెగ్డే కు బావగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు అన్న వార్తలు అయితే బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాలో ఫైట్ సీన్ కోసం హైదరాబాద్ సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి ఈ సెట్లో షూటింగ్ జరగనుంది. ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా వస్తు ఉండేసరికి భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు – ఖలేజా సినిమాలు భారీ బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాయి. ఈ రెండు సినిమాల్లో నటనకు గాను మహేష్కు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరు సూపర్ ఫామ్లో ఉండగా సినిమా వస్తోంది. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.