ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమాతో తన క్రేజ్ ని అమాంతం ప్రపంచ దేశాలకు పాకేలా చేసుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . ఈ క్రమంలోనే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు హాలీవుడ్ జనాలు .
ఈ క్రమంలోని మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సినిమాపై ఏ చిన్న న్యూస్ లీకైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొల్పిన రాజమౌళి రీసెంట్గా సినిమాకి సంబంధించిన మరో కీ పాయింట్ రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది . ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్కడే హీరోగా నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడు అని..
సెకండ్ హాఫ్ లో ఆ హీరో ఎంట్రీ ఉంటుంది అంటూ ఒక క్రేజీ టాక్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..?? గ్లోబల్ హీరోగా పేరు సంపాదించుకున్న తారక్. వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఎన్నో సినిమాలల్లో ఆయన డైరెక్షన్ లో నటించిన తారక్..ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో మెరవనున్నాడట.
విజయెంద్ర ప్రసాద్ రాసిన కథకు ఆ పాత్రకు తారక్ బాగా సెట్ అవుతాడని రాజమౌళి రిక్వెస్ట్ చేశారట . ఈ క్రమంలోనే తారక్ సైతం ఆ పాత్రను ఓకే చేసినట్లు తెలుస్తుంది .దీంతో ఒక్కసారిగా ఎస్ ఎస్ ఎం బి 29 హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఏది ఏమైనా మహేష్ బాబుతో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్స్ ఆఫీస్ కాదు గ్లోబల్ స్థాయిలో రికార్డులు చిరిగిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు . అంతేకాదు మరో ఆస్కార్ కన్ఫామ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!