యాంకర్ అనసూయ టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా జబర్దస్త్ షో నుండి కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. కామెడీ షో లో గ్లామర్ షో తో పాటూ తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ అభిమానులను సంపాదిచుకుంది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ జబర్దస్త్ కు యూత్ కూడా అడిక్ట్ అయ్యేలా చేసింది. ఇక అనసూయ కటౌట్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
అందులోనూ బుల్లితెర పై అనసూయ రేంజ్ లో గ్లామర్ షో చేసిన వాళ్లు చాలా తక్కువ. దాంతో అనసూయకు ఎంతో క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ తరవాత వరుస అవకాశాలను అందుకుంది. మరికొన్ని టీవీ షోలలో కూడా సందడి చేసింది. అంతేకాకుండా అడవి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆ తరవాత ఆమె నటనకు కూడా ఫిదా అయ్యారు.
ఈ సినిమా తరవాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ఆఫర్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అదరగొట్టింది. ఈ సినిమా తరవాత అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా సినిమా ఆఫర్ లు క్యూ కట్టాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. పుష్ప 1లో కూడా అనసూయ అదరగొట్టింది.
అంతేకాకుండా విమానం అనే మరో సినిమాలో కూడా అనసూయ నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల బాడీలో హీట్ పెంచుతూనే ఉంటుంది. రీసెంట్ గా అనసూయ బికినీ వేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇక తాజాగా అనసూయ భర్త భరద్వాజ్కు లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు అనసూయ భర్తపై దారుణంగా కామెంట్ లు చేస్తున్నారు. అంకుల్ అంటూ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా అనసూయకు మండిపోయేలా ఉంది. మరి వీటిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.