సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ పేరుని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంతకు అక్కినేని నాగచైతన్య డివోర్స్ ఇచ్చినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ పై మరింత పగలు పెంచేసుకున్నారు కొందరు జనాలు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఎన్నో భారీ అంచనాలు పెట్టుకొని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా మారింది.
ఈ క్రమంలోనే మరోసారి అక్కినేని హీరోలను ఏకీపారేస్తున్నారు కొందరు ట్రోలర్స్. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీకి ఆడవాళ్లు ఉసురు తగిలిందని అప్పట్లో లక్ష్మి ఉసురు తగిలి నాగర్జున కెరియర్లో ఫుల్ డౌన్ ఫాల్ అయి ..ఆ తర్వాత పైకి ఎదిగాడని ..ఇప్పుడు ప్రజెంట్ నాగచైతన్య – అఖిల్ కూడా అదే సిచువేషన్ లో ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు .
అంతేకాదు అక్కినేని అఖిల్ …శ్రేయ భూపాల్ ను ప్రేమించి.. నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత బ్రేకప్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే . ఆ టైంలో సోషల్ మీడియాలో అఖిల్ పై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ పాపమే ఇప్పుడు అఖిల్ పాలిట శాపంగా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . అంతేకాదు నాగచైతన్య కస్టడీ కూడా ఫ్లాప్ అవుతుందని సమంతని ఏడిపించుకున్న పాపం ఆ ఉసురు ఊరికే పోదు అంటూ పరోక్షకంగా కౌంటర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు .
ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున – అక్కినేని నాగచైతన్య – అక్కినేని అఖిల్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆ ముగ్గురు లేడీస్ ని ఏడిపించుకున్న పాపమే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ పాలిట శాపంగా మారింది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!