పెళ్లి జరిగి ఇన్నేళ్ల‌వుతున్నా ప్రియ‌మ‌ణి ఆ కార‌ణంతోనే పిల్ల‌ల్ని క‌న‌లేదా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అందాల తార ప్రియమణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా చిత్ర పరిశ్రమలో మళ్లీ తన పేరును మారుమోగేలా చేసుకుంటున్న ప్రియమణి.. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో ఫుల్ జోష్ మీద ఉంది. టాలీవుడ్ లో కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది ప్రియమణి.

ఇక ఈమె ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముస్త‌ఫా రాజ్‌కు ఇది రెండో వివాహం. ప్రియ‌మ‌ణి కాస్త ముదురు ఏజ్‌లోనే పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఈ అమ్మడు పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి గుడ్ న్యూస్ బయటకు చెప్పలేదు. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ఈమెను ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు కాదు ముందు నువ్వు ఓ బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకో.. అప్పుడే నీ జన్మ ధన్యం అవుతుంది.. సినిమాలు, వెబ్ సిరీస్‌లులో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటూ స‌ల‌హాలు ఇచ్చి ప‌డేస్తున్నారు. ఇక ప్రియ‌మ‌ణి అందం కోసం పిల్లని కనట్లేదు అన్న రూమర్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రియమణి పై పని క‌ట్టుకుని ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

ఇక్కడ నువ్వు ఎంత గ్లామర్ గా తయారైనా ఎంత గ్లామర్ వ‌లకబోసినా… నీకు హీరోయిన్ అవకాశాలు ఏమీ ఇవ్వరు.. నువ్వు ఇప్పటికే ఆంటీవే.. ఇకనైనా ఈ సినిమాల గురించి పక్కనపెట్టి అమ్మతనం గురించి ఆలోచించు అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెకు సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రియమణి పేరు మరోసారి వైరల్ గా మారింది.