టాలీవుడ్ మెగా ప్రిన్స్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్… హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిన్న నాగబాబు నివాసంలో చాలా గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్ధపు కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతి తక్కువ మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో వీళ్ళిద్దరూ గ్రాండ్గా ఉంగరాలు మార్చుకున్నారు .
ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి – వరుణ్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మిస్టర్ సినిమాలో తొలిసారిగా కలిసి నటీంచిన ఈ ఇద్దరు అక్కడే సినిమా షూట్ లో ఇటలీలో జరుగుతూ ఉండగా ప్రేమలో పడిపోయారట . అప్పటినుంచి ఈ జంట గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూనే వచ్చారు. అయితే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి వరుణ్ ల ప్రేమాయణం బట్టబయలు అయినా దానిపై మెగా ఫ్యామిలీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోవడంతో అందరు సైలెంట్ అయిపోయారు.
అయితే సడన్గా జూన్ 9న ఈ జంట నిశ్చితార్ధం చేసుకొని మెగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. కాగా సోషల్ మీడియాలో వీళ్ల నిశ్చితార్ధపు రింగ్స్ కి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. వరుణ్ – లావణ్య రింగ్స్ ఖరీదు దాదాపు 25 లక్షలు పైనే ఉంటుందని సమాచారం అందుతుంది. అలాగే వరుణ్ రెండు లక్షల విలువైన కుర్తా పైజామా ధరించగా.. లావణ్య చాలా సింపుల్ బెనారసి చీరను కట్టుకుంది. దీని ఖరీదు ఏకంగా మూడు లక్షలు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో వరుణ్ లావణ్య ల నిశ్చితార్ధపు ఫోటోలు వైరల్ గా మారాయి..!!