సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా గురించి కొన్ని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు మొదటి నుంచి అంత సంతృప్తిగా లేరనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన టైటిల్, టీజర్ తాలూకు ప్రి లుక్స్ లో ఎక్కడా తమన్ పేరు లేదు. నిర్మాత చినబాబుతో పాటు డైరెక్టర్ ని మాత్రమే హైలెట్ చేశారు.
ఎక్కడో ఒకచోట పోస్టర్ మీద ఉండాల్సిన మ్యూజిక్ తమన్ అనే ట్యాగ్ మాయం అయింది. కేవలం కావాలనే తమన్ పేరు తొలగించారు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎల్లుండి వచ్చే టీజర్ లో తమన్ బిజీఎం ఉంటుంది. ఇక ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం తమన్ వర్క్ విషయంలో మహేష్ ఏమాత్రం సంతృప్తిగా లేడట. అసలే సర్కారు వారి పాటకు ఫూర్ ఆల్బమ్ ఇచ్చాడు. పైగా ఆ సినిమా బిజీ ఎం మాత్రం బాగోలేదు.
సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ పెద్ద దెబ్బేశాడు. అప్పుడు పోటీగా వచ్చిన బన్నీ అల వైకుంఠపురంలో సినిమాకు తమన్ అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు. అందుకే సర్కారు వారి పాట సినిమాకు ఛాన్స్ ఇచ్చిన తమన్ సరిగా వర్క్ చేయలేదని.. ఈ సినిమాకు అనిరుధ్ లేదా మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవాలని మహేష్ త్రివిక్రమ్ కు సూచించాడు. అయితే త్రివిక్రమ్ పట్టుబట్టి మహేష్ – తమన్ మధ్య ఏకంగా దుబాయ్లో రాజీ చేసి ఈ ప్రాజెక్టులోకి తమన్ను తీసుకువచ్చాడు.
అయితే ఇప్పటివరకు జరిగిన ఔట్ఫుట్ చాలా పూర్ గా ఉందని తెలుస్తోంది. తమన్ సినిమాల కంటే అటు ఆహా ఐడియల్ షోలు చేసుకోవటం.. క్రికెట్ ఆడుకోవడంతో కాలం గడిపేస్తున్నాడు అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. తమన్ అవుట్ పుట్ విషయంలో త్రివిక్రమ్ కూడా కోపంతో ఉన్నాడని.. అందుకే ఈరోజు పోస్టర్లో తమన్ పేరు కావాలని త్రివిక్రమ్ మాయం చేశాడని… ఇది తమన్కు ఘోరా అవమానం లాంటిదే అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి రేపు టీజర్ వీడియోలో తమన్ పేరు ఉంటుందా ? ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా ఉంది.