టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకుంది. కొంతసేపటి క్రితం ఓ యువ దర్శకుడు క్యాన్సర్ తో మృతి చెందాడు. టాలీవుడ్ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కొంతసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన టాలీవుడ్కి సీతారామ్గా తెలుసు. ఆర్యన్ రాజేష్ హీరోగా నిరీక్షణ సినిమాకు సీతారామ్ దర్శకత్వం వహించాడు.
ఈ నిరీక్షణే ఆయనకు తొలి సినిమా. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సీతారామ్ విమర్శకులతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ తో శత్రువు , నవదీప్తో నటుడు ఇలా ఎనో సినిమాలను తెరకెక్కించాడు. సీతారామ్ ఇటీవల రిక్కీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇలాంటి సమయంలో ఆయన క్యాన్సర్ తో మృతి చెందాడం భాధాకరం. చాలామంది ప్రముఖ దర్శకులు దగ్గర రైటర్ గా, గోస్ట్ రైటర్ గా పనిచేసిన సీతారామ్ మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారామ్ ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జన్మించారు.