టాలీవుడ్ లోకి నాగచైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ సూపర్ డూపర్ హిట్లు కొడుతూ పదేళ్లపాటు తెలుగులో తిరిగిలేని హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ క్రమంలోనే తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల పాటు కాపురం చేశాక 2021లో ఈ జంట విడిపోయారు.
అయితే సమంత నాగచైతన్య కంటే ముందే కొందరు సినిమా వాళ్ళతో ప్రేమలో పడి బ్రేకప్ లు కూడా జరిగాయి. ఆ లిస్టులో ప్రముఖులు కూడా ఉన్నారు. సమంత ముందుగా ఏ మాయ చేసావే సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్ను ప్రేమించిందన్న పుకార్లు కోలీవుడ్లో వినిపించాయి. గౌతమ్ దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమాలో సమంతకి చిన్న రోల్ ఇచ్చారు. ఆ తర్వాత మరో సినిమాలోని సమంతకు ఒక పాత్ర ఇవ్వడంతో వీరిద్దరి మధ్య సానిహిత్యం పెరిగింది.
అదికాస్తా ప్రేమగా మారిందన్న టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే సమంత.. గౌతమ్ కు తెలియకుండా వేరే సినిమాల్లో నటించడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని అంటారు. ఈ క్రమంలోనే గౌతమ్ మీనన్ – సమంత కలిసి ఒకే ప్లాట్లో ఉంటూ ఉండగా… గౌతమ్ భార్య ఆ ఫ్లాట్ కి వెళ్లి సమంతకు వార్నింగ్ ఇచ్చిందన్న పుకార్లు కూడా వినిపించాయి. దీంతో సమంత చెన్నై వదిలి హైదరాబాద్కు వచ్చేసింది అంటారు.
ఇక నాగచైతన్య కంటే ముందే సమంత మరో హీరో సిద్ధార్థతో కొద్దిరోజులపాటు ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ కలిసి పూజలు కూడా చేశారు…చెట్టపట్టలేసుకుని తిరిగేవారు. సిద్ధార్థ కు బ్రేకప్ చెప్పాక చైతుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోను సమంత చాలా సన్నిహితంగా ఉండేదని.. అందుకే త్రివిక్రమ్ తన సినిమాలలో వరుసగా ఆమెకు ఆఫర్లు ఇచ్చారని కూడా టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటూ ఉంటారు.