ప్రముఖ హీరోయిన్ పూర్ణ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవును, అవును 2 సినిమాలతో ఆమె భారీ సక్సెస్ అందుకున్నారు. అలాగే తెలుగులో కొన్ని హిట్ సినిమాలలో కూడా ఆమె నటించారు. అల్లరి నరేష్ కు జోడిగా సీమటపాకాయ్ సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అయితే పూర్ణ ఎన్ని సినిమాలు చేసిన ఆమెకు అదృష్టం కలిసి రాక స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె బాలయ్య – బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను.. ఇటు బుల్లితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దర్శకనిర్మాత రవిబాబు దర్శకత్వం వహించిన అసలు సినిమా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో రవిబాబుతో పాటు పూర్ణ కూడా నటించారు. రవిబాబు సినిమాలో పూర్ణ ఎక్కువగా నటిస్తూ ఉంటారు. దీనిపై రకరకాల వార్తలు ఇప్పటికే ఉన్నాయి.
పూర్ణకు రవిబాబుకు మధ్య ఎఫైర్ ఉందని.. పూర్ణ తనకు బాగా కోఆపరేట్ చేస్తుందన్న కారణంతోనే రవిబాబు ఆమెకు తన సినిమాలలో ఎక్కువగా ఛాన్సులు ఇస్తూ ఉంటాడన్న అపోహలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇది నిజమని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అసలు ఈ సినిమా ప్రమోషన్లలో ఈ విషయంపై రవిబాబు క్లారిటీ ఇచ్చారు.
పూర్ణతో తరచూ సినిమాలు తీస్తుంటే నాకు తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉందని.. చాలామంది అనుకునేవారు.. కానీ వాస్తవంగా చూసుకుంటే 200% మెరుగైన అవుట్పుట్ అందించే ప్రత్యేక నటులను ఇష్టపడే దర్శకలకు ఇది సాధారణం.. పూర్ణ అటువంటి రత్నం అంటూ ఒక మాటతో ఈ రూమర్స్కు రవిబాబు పుల్స్టాప్ పెట్టారు. ఇక పూర్ణ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.