సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. ఎవరికి వారు తమ సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే మంచి, మానవత్వాలను మంట కలిపేస్తున్నారు. కనీసం మనమంతా ఒక్కటే సర్ది చెప్పుకోవాలన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు.
దీనికి తోడు సోషల్ మీడియా వల్ల అనేకానేక దుష్పలితాలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో ? దాని వల్ల అంతే చెడు కూడా జరుగుతోంది. సోషల్ మీడియా దుష్ఫలితాలు చివరకు మనుష్యుల ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. తాజాగా తెలంగాణలో దారుణం జరిగింది. చెల్లి
సోషల్ మీడియాలో రీల్స్ పెడుతుందని రోకలి బండతో కొట్టి చంపేశాడు అన్న.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం రాజీవ్ నగర్కు చెందిన అజ్మీర సింధు మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె తరచూ సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు పెడుతుంది. ఆమె అన్న హరిలాల్ చెల్లిని రీల్స్ చేయవద్దని వారించినా.. ఆమె వినట్లేదని ఆమెను రోకలి బండతో తలపై కొట్టగా చనిపోయింది. క్షణికావేశంతో హరి చేసిన పనికి చెల్లి జీవితం బలైపోయింది.