తమన్నా మేనత్త మొగుడు టాలీవుడ్ టాప్ విలన్…మీకు తెలుసా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబోలో వచ్చిన ‘ బద్రీనాథ్ ‘. వి .వి వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. 2011 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో తమన్నా మేనత్త గుర్తుందా… మర్చిపోయా క్యారెక్టర్ అయితే కాదు. విలన్ భార్య పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించిన ఈ నటి పేరు అశ్విని కల్సేకర్. మరాఠీ, హిందీ చిత్రాల్లో అశ్విని ఎక్కువగా నటించింది.

బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్, షోస్ చేసింది. బద్రీనాథ్ సినిమాతో తెలుగు తెరకు లేడీ విలన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఈమె నిప్పు, మెహబూబా చిత్రాల్లో నటించింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే… అశ్విని భర్త టాలీవుడ్ లో టాప్ విలన్. అతను మరెవరో కాదు మురళీ శర్మ. అశ్విని 1998లో నితీష్ పాండేని వివాహం చేసుకుంది. వారు 2002లో చిన్న చిన్న మనస్పార్థాలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

2009లో నటుడు మురళి శర్మను రెండో పెళ్లి చేసుకుంది. మురళి శర్మ బాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన కొన్ని ఏళ్లకే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో విలన్ పాత్ర కాకుండా కొన్ని ప్రధానమైన పాత్రలు చేస్తూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టులలో ఒకడుగా నిలిచాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక పాత్రల్లో పోషిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.