టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాదులోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలిసిన వెంటనే సినీ ప్రముఖులతో పాటు పలువురు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే పక్కనే ఉన్న స్థానికులు శర్వానంద్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని శర్వానంద్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
అయితే హాస్పటల్కు చేరుకున్న శర్వా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రీసెంట్గా శర్వాకు తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లోని జోధ్పూర్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టైంలో ఇలా జరగడంతో శర్వా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇక తాజాగా శర్వా సేఫ్ అని టీం క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.